మంగళగిరి ఆనందకవి (Mangalagiri Anandakavi)

Share
పేరు (ఆంగ్లం)Mangalagiri Anandakavi
పేరు (తెలుగు)మంగళగిరి ఆనందకవి
కలం పేరు
తల్లిపేరు
తండ్రి పేరు
జీవిత భాగస్వామి పేరు
పుట్టినతేదీ
మరణం
పుట్టిన ఊరు
విద్యార్హతలు
వృత్తి
తెలిసిన ఇతర భాషలు
చిరునామా
ఈ-మెయిల్
ఫోను
వెబ్ సైటు / బ్లాగు పేరు, లంకె
స్వీయ రచనలువేదాంతరసాయనము, విజయనందన విలాసము
ఇతర రచనలు
ఈ-పుస్తకాల వివరాలు
పొందిన బిరుదులు / అవార్డులు
ఇతర వివరాలు
స్ఫూర్తి
నమూనా రచన శీర్షికమంగళగిరి ఆనందకవి
సంగ్రహ నమూనా రచన

మంగళగిరి ఆనందకవి

మంగళగిరి ఆనందకవి వేదాంత రసాయనము అనే పేరుతో ఏసుక్రీస్తు చరిత్ర ప్రబంధాన్ని 1780-90ల మధ్యకాలంలో రచించాడు. ఈ కావ్యం 1882లో మొదటిసారి ముద్రించబడింది. ఈ కావ్యంలో నాలుగు ఆశ్వాసాలు ఉన్నాయి. మల్లరాన, జ్ఞానబోధల మధ్య సంభాషణరూపంలో ఉంది. వేదవ్యాసుని వేదాంత పద్ధతిని అధ్యయనం చేసి, అదే నమూనాలో క్రైస్తవ మతగ్రంథ సారాన్ని, ముఖ్యంగా కొత్త నిబంధన గ్రంథ సారాన్ని ఈ వేదాంత రసాయనములో కవి ఇమిడ్చాడు. క్రైస్తవ మత సంప్రదాయాలు, క్రీస్తు చరిత్ర దీనిలో వర్ణించబడి ఉంది. భారత, భాగవతాలలోని కొన్ని ఘట్టాలను ఈ కావ్యంలో పోల్చారు. ఈ గ్రంథాన్ని ఫ్రెంచి వారి తరఫున మచిలీపట్టణాన్ని పాలించిన నిడుమామిళ్ల దాసప్పకు అంకితమిచ్చాడు. ఈ గ్రంథం 1926, 1969లలో పునర్ముద్రణలు పొందింది.

విజయనందన విలాసము  మూడు ఆశ్వాసముల ప్రబంధము[2]. దీనిని 1919లో చెలికాని లచ్చారావు సంపాదకత్వంలో అముద్రితాంధ్ర గ్రంథ సర్వస్వంలో భాగంగా చతుర్థ గ్రంథంగా ప్రచురించారు. చిత్రాడలోని శ్రీరామ విలాస ముద్రాక్షరశాలలో ప్రచురింపబడింది. రచయిత ఈ గ్రంథాన్ని దాట్ల వేంకటకృష్ణ నృపాలునికి అంకితమిచ్చాడు. ఆభిమన్యుని చరిత్ర ఈ కావ్యంలో కథావస్తువు.

———–

You may also like...