చల్లా సత్యవాణి (Challa Satyavani)

Share
పేరు (ఆంగ్లం)Challa Satyavani
పేరు (తెలుగు)చల్లా సత్యవాణి
కలం పేరు
తల్లిపేరుచల్లా అచ్యుత రామలక్ష్మి
తండ్రి పేరుచల్లా వీరావధానులు
జీవిత భాగస్వామి పేరు
పుట్టినతేదీ
మరణం
పుట్టిన ఊరు
విద్యార్హతలు
వృత్తి
తెలిసిన ఇతర భాషలు
చిరునామా
ఈ-మెయిల్
ఫోను
వెబ్ సైటు / బ్లాగు పేరు, లంకె
స్వీయ రచనలుసత్యవ్యాస కదంబం ప్రథమ భాగం ,
డాక్టర్ ఎ.బి నాగేశ్వరరావు-ఏ పొలిటికల్ స్టడీ, ద్వాదశ జ్యోతిర్లంగ క్షేత్ర దర్శిని , మా ఊరి గుళ్ళు-తరలివచ్చిన దేవుళ్ళు , గోదావరి పుష్కర దర్శిని, ఆగలింగ క్షేత్రత్రదర్శిని
ఇతర రచనలు
ఈ-పుస్తకాల వివరాలు
పొందిన బిరుదులు / అవార్డులు
ఇతర వివరాలు
స్ఫూర్తి
నమూనా రచన శీర్షికచల్లా సత్యవాణి
సంగ్రహ నమూనా రచన

చల్లా సత్యవాణి

చల్లా సత్యవాణి తెలుగు రచయిత్రి. ఆమె కందుకూరి రాజ్యలక్ష్మి కళాశాల అధ్యాపకురాలిగా, ఎన్.సి.సి మేడంగా సేవలిందించి, రాజమహేంద్రి మహిళా కళాశాల ప్రిన్సిపాల్ గా చేసి, డైరెక్టర్ గా కొనసాగుతున్నారు.ఆధ్యాత్మికంగా తాను అనుభూతి పొందుతూ, పదిమందికీ ఆ అనుభూతిని అందించడానికి, పుస్తక రూపంకల్పించి, ఆధ్యాత్మికసంపద వితరణచేస్తున్నారు.
కౌండిన్యస గోత్రికులు శ్రీమతి చల్లా అచ్యుత రామలక్ష్మి, శ్రీ వీరావధానులు పుణ్యదంపతులకు 1942 ఏప్రిల్ 4 న అంటే చిత్రభాను సంవత్సర చైత్ర బహుళ తదియ శనివారం రాజోలు తాలూకా మలికిపురం మండలం మోరి గ్రామంలో డాక్టర్ చల్లా సత్యవాణి జన్మించారు. 1942మే నెలనుంచి ఈమె రాజమండ్రి దానవాయిపేట ఇంటినెంబర్ 46-18-11లోనే నివసిస్తున్నారు. ఈ ఇంటిపేరే ప్రణవకుటి.డాక్టర్ (మేజర్) సత్యవాణి ఎం.ఏ (హిందీ) సాహిత్యరత్న, ఎం.ఏ (రాజనీతి శాస్త్రం, ఎం.ఏ (ఫిలాసఫీ, ఎం.ఇడి, ఎం.ఫిల్, పిహెచ్.డి.పూర్తిచేశారు. శ్రీమతి కందుకూరి రాజ్యలక్ష్మి స్త్రీల కళాశాలలో లెక్చరర్గా పనిచేసిన ఈమె ఎన్.సి.సి ఆఫీసరుగా, ఎన్ఎ.స్.ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్ గా సేవలందించారు.ఎంతోమంది విద్యార్థినులకు స్ఫూర్తినిచ్చారు. పదవీ విరమణచేసాక, రాజమహేంద్రి మహిళా కళాశాల ప్రిన్సిపాల్ గా బాధ్యతలు చేపట్టి, కళాశాల అభివృద్ధికి బాటలువేశారు. ప్రస్తుతం డైరక్టర్ గా కొనసాగుతున్నారు.
ఓ పుస్తకం వేయడమే చాలా కష్టం. అలాంటిది అంత్యంత నాణ్యతతో, అరుదైన ఫోటోలు సేకరించి మరీ, పుస్తకాలమీద పుస్తకాలు వేయడం ఆషామాషీ కాదు. పైగా ఎవరి సాయం లేకుండా తన సొంత ధనం వెచ్చించి, ఆధ్యాత్మిక సంపదగా మలచి, పదుగురికే పంచడం ఆమెకే చెల్లింది. ఈవిధంగా తాను పొందుతున్న పుణ్యాన్ని పదిమందికీ పంచుతున్నారని ప్రశంసించని వారు లేరు.గడిచిన 16 ఏళ్లుగా ఈ యజ్ఞం కొనసాగిస్తున్నారు.దేశంలోని మారుమూల ప్రాంతాలకు సైతం వెళ్లి అక్కడ ఆలయాలను దర్శించి, వాటి విశిష్టత అవగతం చేసుకుంటారు. ఇక అక్కడకు ఎలావెళ్ళాలి వంటి విషయాలంటిని పొందుపరుస్తూ, వ్యాసాలను పత్రికలకు అందించడమేకాదు, మళ్ళీ వాటన్నింటినీ క్రోడీకరించి, పుస్తక రూపంతెచ్చి, ఉచితంగా పంచిపెట్టడం ఈమె సహజ లక్షణం. ఈవిధంగా ఇప్పటివరకూ ఈమె 25పుస్తకాలు అందుబాటులోకి తెచ్చారు.
డాక్టర్ (మేజర్) సత్యవాణి రచించిన గ్రంథాల్లో దాదాపు అన్ని ముద్రితమయ్యాయి. తాజాగా శ్రీ యాతగిరి శ్రీరామ నరసింహారావు అశీతి (80 ఏళ్ళ పండుగ) సందర్భంగా ఆయన నివాసం దగ్గర ఉన్న ప్రాచీన శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి స్థల చరిత్రపై పుస్తకాన్ని ముద్రించారు. శ్రీ యాతగిరికి అంకితం ఇచ్చిన ఈ పుస్తకాన్ని 2016 సెప్టెంబరు 28న మాజీ ఎం ఎల్ ఏ శ్రీ రౌతు సూర్యప్రకాశరావు ఆవిష్కరించారు.

సత్యవ్యాస కదంబం ప్రథమ భాగం (30.4.2000).
డాక్టర్ ఎ.బి నాగేశ్వరరావు-ఏ పొలిటికల్ స్టడీ (1.11.2001).
ద్వాదశ జ్యోతిర్లంగ క్షేత్ర దర్శిని (4.3.2003).
మా ఊరి గుళ్ళు-తరలివచ్చిన దేవుళ్ళు (2003).
(గోదావరి పుష్కర దర్శిని, ఆగలింగ క్షేత్రత్రదర్శిని (ఫిబ్రవరి2004)
నవజనార్ధన క్షేత్రదర్శిని (ఆగస్టు2004).
ఎన్.సి.సి-ఏ సింబల్ ఆఫ్ డిసిప్లిన్ తొలిభాగం (4.3.2005).]]
పంచారామ క్షేత్రదర్శిని (మార్చి05).
20సత్యవ్యాస కదంబం రెండవభాగం (ఏప్రియల్2006).
ద్వాదశ నారసింహ క్షేత్రదర్శిని (23.8.2008).
రాజమహేంద్రిలో ఒకనాటి నాయకత్రయం (1.11.2008).
పంచాయతన దేవాలయములు-తూర్పు గోదావరి జిల్లా (3.11..2008).
శ్రీ పర్వతవర్ధినీ ఉమారామలింగేశ్వర పంచాయతన ఆలయం-శ్రీ పద్మావతీ సమేత శ్రీ వేంకటేశ్వరస్వామివార్ల క్షేత్రమహ్యత్యం (11.11.2008).
ఎన్.సి.సి-ఏ సింబల్ ఆఫ్ డిసిప్లిన్ రెండవభాగం (నవంబరు 2008).
అష్ట సోమేశ్వర క్షేత్రదర్శిని-తూర్పుగోదావరి జిల్లా ప్రథమముద్రణ (23.2.2009).
మహిళారత్నం, పద్మ విభూషణ్ డాక్టర్ దుర్గాబాయి దేశ్ ముఖ్ (15.7.2009).
హిమాలయ క్షేత్రదర్శిని (28.3.2010).
అష్టమూర్తి శివక్షేత్రదర్శిని (4.4.2011).
రాజమహేంద్రవర వరపుత్రుడు, శతాబ్ది మహనీయుడు డాక్టర్ ఎ.బి.నాగేశ్వరరావు (14.2.2012).
నలుదిక్కులా నాలుగుక్షేత్రాలు (23.3.2012).
అష్ట సోమేశ్వర క్షేత్రదర్శిని – తూర్పుగోదావరి జిల్లా రెండవముద్రణ (10.3.2013).
తిరుమల తిరుపతి శ్రీ వెంకటేశ్వర యాత్రాదర్శిని (15.4.2015).
గోదావరి పరీవాహక క్షేత్రాలు-దేవాలయాలు (గోదావరి పుష్కర క్షేత్ర దర్శిని – 14.7.2015).]]
‘కృష్ణానది పరీవాహక క్షేత్రాలు-దేవాలయాలు’ (కృష్ణవేణి పుష్కర దర్శిని – ఆగస్టు 2016)
శ్రీలక్ష్మీ నరసింహస్వామి దేవాలయ స్థలచరిత్ర (28.9.2016).

———–

You may also like...