పేరు (ఆంగ్లం) | Polkampalli Shantadevi |
పేరు (తెలుగు) | పోల్కంపల్లి శాంతాదేవి |
కలం పేరు | – |
తల్లిపేరు | సీతమ్మ |
తండ్రి పేరు | సూగూరు హనుమంతరావు |
జీవిత భాగస్వామి పేరు | – |
పుట్టినతేదీ | – |
మరణం | – |
పుట్టిన ఊరు | – |
విద్యార్హతలు | – |
వృత్తి | – |
తెలిసిన ఇతర భాషలు | – |
చిరునామా | – |
ఈ-మెయిల్ | – |
ఫోను | – |
వెబ్ సైటు / బ్లాగు పేరు, లంకె | – |
స్వీయ రచనలు | చండీప్రియ, ప్రేమపూజారి, బాటసారి, రక్తతిలకం,పచ్చిక, పూజాసుమం, ప్రేమ బంధం, జీవన సంగీతం, సుమలత, దేవదాసి, పుష్యమి, వరమాల |
ఇతర రచనలు | – |
ఈ-పుస్తకాల వివరాలు | – |
పొందిన బిరుదులు / అవార్డులు | – |
ఇతర వివరాలు | – |
స్ఫూర్తి | – |
నమూనా రచన శీర్షిక | పోల్కంపల్లి శాంతాదేవి |
సంగ్రహ నమూనా రచన | – |
పోల్కంపల్లి శాంతాదేవి
పోల్కంపల్లి శాంతాదేవి సామాజిక సమస్యలను, స్త్రీల అవస్థలను తన నవలలో చిత్రీకరిస్తూ సామాజిక చైతన్యాన్ని కలిగిస్తున్న ప్రముఖ తెలుగు నవలా రచయిత్రి. సహజత్వంతో, వాస్తవికతకు దగ్గరగా, తాత్వికతతో కూడిన రచనలు చేసింది. మహబూబ్ నగర్ జిల్లా, పెబ్బేరుమండలంలోని శ్రీరంగాపూర్ ఈమె స్వస్థలం. ఈమె కథలపై శరత్ ప్రభావం ఎక్కువ. 1942లో జన్మించింది. సీతమ్మ, సూగూరు హనుమంతరావులు ఈమె తల్లిదండ్రులు. వీరి పూర్వికులు, తండ్రిగారు కూడా వనపర్తి సంస్థానాధీశుల దగ్గర ఉన్నతోద్యోగులుగా పనిచేశారు. విద్యార్థి దశ నుండే రచనా వ్యాసంగాన్ని మొదలు పెట్టారు. 1961లో వీరి మొదటి రచన ముక్తిమార్గం కుసుమహరనాథ పత్రికలో అచ్చైంది. ప్రజామత వారపత్రికలో ధారావాహికగా వీరి మొదటి నవల పాణీగ్రహం వచ్చింది.అదే పత్రికలో ఆ తరువాత కాలపురుషుని హెచ్చరిక వచ్చింది. ఈమె 40 కు పైగా నవలలు రాశారు. చండీప్రియ, ప్రేమపూజారి, బాటసారి, రక్తతిలకం,పచ్చిక, పూజాసుమం, ప్రేమ బంధం, జీవన సంగీతం, సుమలత, దేవదాసి, పుష్యమి, వరమాల వీరి నవలలలో కొన్ని. 7 కథాసంపూటాలు వెలువరించింది. 1974లోముళ్ళగులాభి అను కథా సంకలనాన్ని తన సంపాదకత్వంలో తీసుకవచ్చింది. జీవన సంగీతం, ప్రేమబంధం నవలలకు ఆంధ్రప్రభనిర్వహించిన పోటీలలో బహుమతులు వచ్చాయి. చండీప్రియ, పుష్యమి, వరమాల, పచ్చిక నవలలు చలనచిత్రాలుగా వచ్చాయి. ఉజ్జ్వల. నవజ్యోతి, నవసాహితీ వంటి పలు సంస్థలు వీరి రచనలను ముద్రించాయి. జ్యోతి, జాగృతి వంటి పలు పత్రికల్లో అనేక వ్యాసాలు రాశారు. ఈమె మంచి వక్త కూడా. ఆదర్శగృహిణి. అల్లికలు,చిత్రలేఖనం, సాహిత్య కార్యక్రమాలాలో పాల్గొనడం ఆమె అభిరుచులు.
———–